టీ–కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు
05-03-2020 Thu 17:00
- కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసు
- శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ అరెస్టు
- నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారన్న ఆరోపణల కేసులో టీ–కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి రేవంత్ ను నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి రేవంత్ సహా 8 మందిపై నార్సింగ్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రేవంత్ అనుచరులు నలుగురిని అరెస్టు చేశారు.
More Latest News
రష్యా సైనికులను వణికించిన మేక
26 minutes ago

ఈసారి చంద్రబాబు మాట కూడా వినం... వైసీపీ వాళ్ల వీపులు పగలడం ఖాయం: ప్రత్తిపాటి పుల్లారావు
28 minutes ago

శ్రీకాకుళంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
42 minutes ago

ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
58 minutes ago
