హస్తకళా వేదికను ఆకస్మికంగా సందర్శించిన మోదీ.. అక్కడ ఏం తిన్నారో తెలుసా?
19-02-2020 Wed 17:09
- లిట్టి చోఖా తిని, తందూరీ చాయ్ (కుల్హాద్ టీ) తాగిన ప్రధాన మంత్రి
- నులక మంచం, వెదురు కుర్చీల్లో కూర్చుని స్నాక్స్
- లిట్టి చోఖాకు రూ.120, కుల్హాద్ టీకి రూ.40 బిల్లు కట్టిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని హునార్ హాట్ హస్తకళా వేదికను ఆకస్మికంగా సందర్శించారు. ఆ ప్రాంతమంతటా కలియదిరిగి హస్త కళాకృతులు అమ్ముతున్న దుకాణాలను పరిశీలించారు. అక్కడివారితో మాట్లాడారు. తర్వాత హునార్ హాట్ మధ్యలో ఉన్న ఓ ఓపెన్ హోటల్ లో స్నాక్స్ తిన్నారు.
వెదురు కుర్చీలపై కూర్చుని

ఏమిటీ లిట్టి చోఖా, కుల్హాద్?

ఇక కుల్హాద్ టీ అంటే తందూరీ చాయ్. ఇది ఈ మధ్య దేశవ్యాప్తంగా అన్ని చోట్లా లభిస్తోంది. కుండల్లాగా మట్టితో చేసే చిన్న గ్లాసులు, కప్పులను నిప్పులపై చాలా సేపు ఉంచి వేడి చేస్తారు. అప్పుడే పెట్టిన టీని ఈ వేడి వేడిగా ఉన్న మట్టి కప్పుల్లో పోసి, ఇస్తారు. మట్టి కప్పు వేడికి టీ కొంత పొంగి, చల్లారుతుంది. కొంత మట్టి వాసన, స్మోకీ ఫ్లేవర్ తో విభిన్నంగా ఉండే ఈ టీకి ఈ మధ్య చాలా డిమాండ్ పెరిగింది.
More Latest News
తెలంగాణలో కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు
7 hours ago

బౌల్ట్, డికాక్ వంటి ఆటగాళ్లు టెస్టులకు దూరం కావడంపై ఐసీసీ దృష్టి సారించాలి: విజయసాయిరెడ్డి
7 hours ago
