6 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించిన కేంద్ర ప్రభుత్వం!
20-07-2019 Sat 13:36
- ఇటీవల ఏపీ గవర్నర్ గా హరిచందన్ నియామకం
- యూపీ గవర్నర్ గా ఆనందీబెన్ పటేల్
- మధ్యప్రదేశ్ గవర్నర్ గా లాల్జీటాండన్ నియామకం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ను ఇటీవల నియమించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా బీజేపీ నేత, గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.
ఇక పశ్చిమబెంగాల్ గవర్నర్ గా జగదీప్ ధన్ఖర్, త్రిపుర గవర్నర్ గా రమేశ్ బయాస్, నాగాలాండ్ గవర్నర్ గా ఆర్ఎన్ రవిని నియమిస్తున్నట్లు తెలిపింది.అలాగే బిహార్ గవర్నర్ గా పగూ చౌహాన్, మధ్యప్రదేశ్ గవర్నర్ గా లాల్జీ టాండన్ ను నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఉన్న ఆనందీబెన్ పటేల్ ఉత్తరప్రదేశ్ కు బదిలీపై వెళుతున్నారు.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
2 hours ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
3 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
4 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
4 hours ago
