దసరా బరిలోకి దిగేస్తానంటోన్న శర్వానంద్
29-06-2019 Sat 16:27
- విడుదలకి సిద్ధమవుతోన్న'రణరంగం'
- తదుపరి షెడ్యూల్ దిశగా '96' రీమేక్
- శర్వానంద్ సరసన సమంత

శర్వానంద్ తాజా చిత్రంగా 'రణరంగం' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా '96' మూవీ రీమేక్ రూపొందుతోంది. ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచన చేశారు. అయితే షూటింగు సమయంలో శర్వానంద్ గాయపడటంతో ఆయనకి శస్త్రచికిత్స చేశారు. కొన్ని రోజుల పాటు శర్వానంద్ ఫిజియో థెరపీ కూడా చేయించుకోవాల్సి వుంది.
దాంతో ఈ సినిమా దసరాకి రాకపోవచ్చనే టాక్ వచ్చింది. అయితే .. జూలై చివరి వారం నుంచి తన పోర్షన్ కి సంబంధించిన షెడ్యూల్స్ వేసుకోమనీ, ఈ లోగా తన కాంబినేషన్ లేని సీన్స్ ను కానిచ్చేయమని శర్వానంద్ చెప్పినట్టుగా సమాచారం. దసరాకి ఈ సినిమాను తప్పకుండా రిలీజ్ చేయవలసిందేననేది శర్వానంద్ ఉద్దేశంగా కనిపించడంతో, ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాయికగా సమంత కనిపించనున్న సంగతి తెలిసిందే.
More Latest News
తెలంగాణ డీజీపీ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. పోలీసులనే డబ్బు అడిగిన సైబర్ నేరగాళ్లు!
27 minutes ago

హీరో శ్రీకాంత్, ఊహల కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
44 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
1 hour ago

మహారాష్ట్రలో మలుపు తిరుగుతున్న రాజకీయం.. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేకు ఏక్నాథ్ షిండే ఫోన్!
1 hour ago

దేశంలో మళ్లీ 17వేల కరోనా కొత్త కేసులు
2 hours ago

20 ఏళ్ల తర్వాత రష్యాకు అత్యంత గడ్డు స్థితి!
2 hours ago
