అంతర్జాతీయ క్రికెట్ తొలి మహిళా రెఫరీగా తెలుగు మహిళ నియామకం
14-05-2019 Tue 15:28
- తొలి మహిళా మ్యాచ్ రెఫరీగా జీఎస్ లక్ష్మి నియామకం
- డొమెస్టిక్ క్రికెట్లో పలు మ్యాచ్ లకు రెఫరీగా పని చేసిన లక్ష్మి
- ఐసీసీ, బీసీసీఐలకు ధన్యవాదాలు తెలిపిన లక్ష్మి

భారతీయ మాజీ మహిళా క్రికెటర్ జీఎస్ లక్ష్మి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఐసీసీ ఇంటర్నేషనల్ మ్యాచ్ రెఫరీల ప్యానల్ లో చోటు సంపాదించారు. ఈ ప్యానల్ లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా ఘనతను సాధించారు. 1968లో రాజమండ్రిలో ఆమె జన్మించారు. 2008-09 మధ్య కాలంలో దేశీయ మహిళా క్రికెట్లో 51 ఏళ్ల లక్ష్మి రెఫరీగా వ్యవహరించారు. మూడు మహిళా వన్డే మ్యాచ్ లకు, పలు టీ20లకు ఆమె ఐసీసీ అధికారిణిగా సేవలందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ ప్యానల్ లో చోటు దక్కించుకోవడాన్ని తాను అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇండియన్ క్రికెటర్ గా, దేశీయ మ్యాచ్ రెఫరీగా తనకు ఎంతో అనుభవం ఉందని తెలిపారు. ఈ అనుభవాన్ని అంతర్జాతీయ వేదికపై ఉపయోగించుకుంటానని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఐసీసీ, బీసీసీఐలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
More Latest News
దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ చానళ్లపై వేటు
32 minutes ago

తిరుమలలో రోజా హల్ చల్.. 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం
38 minutes ago

వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
53 minutes ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
1 hour ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
2 hours ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
2 hours ago
