అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన సమాజ్ వాదీ పార్టీ.. మైనాపురి నుంచి ములాయం
08-03-2019 Fri 12:39
- తొలి జాబితాలో ఆరుగురు అభ్యర్థులు
- కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశం
- గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ములాయం

లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల తొలి జాబితాను సమాజ్ వాదీ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. వారిలో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్, కమలేష్ కఠేరియా, భాయీలాల్ కోల్, షబ్బీర్ వాల్మీకిలు ఉన్నారు. ములాయం సింగ్ మైనాపురి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్ లు ములాయం బంధువులే.
2014 లోక్ సభ ఎన్నికల్లో మైనాపురి, ఆజంగఢ్ స్థానాల నుంచి ములాయం పోటీ చేసి, రెండు చోట్లా గెలుపొందారు. అనంతరం మైనాపురి స్థానానికి రాజీనామా చేసి, ఆజంగఢ్ ఎంపీగా కొనసాగారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో మైనాపురి నుంచి వీరి కుటుంబానికే చెందిన తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ పోటీ చేసి, గెలుపొందారు.
More Latest News
రష్యా సైనికులను వణికించిన మేక
19 minutes ago

ఈసారి చంద్రబాబు మాట కూడా వినం... వైసీపీ వాళ్ల వీపులు పగలడం ఖాయం: ప్రత్తిపాటి పుల్లారావు
22 minutes ago

శ్రీకాకుళంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
35 minutes ago

ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
51 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
56 minutes ago
