ఇండియా వర్సెస్ ఇండియా పోరులో సింధుపై నెగ్గిన సైనా
15-04-2018 Sun 07:15
- 21-18, 23-21 తేడాతో సింధుపై నెగ్గిన సైనా
- రజతంతో సరిపెట్టుకున్న పీవీ సింధు
- 26కు పెరిగిన స్వర్ణాల సంఖ్య

ఆసక్తికరంగా సాగిన కామన్వెల్త్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోరులో పీవీ సింధూపై సైనా నెహ్వాల్ గెలిచింది. ఆద్యంతం నువ్వా? నేనా? అన్నట్టు సాగిన ఈ పోటీలో సైనా నెహ్వాల్ 21-18, 23-21 తేడాతో సింధుపై వరుస సెట్లలో నెగ్గి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, సింధు రజతంతో సరిపెట్టుకుంది.
తొలి గేమ్ నుంచి దూకుడుగా ఆడిన సైనా నెహ్వాల్ మూడు పాయింట్ల తేడాతో సెట్ ను గెలిచి, ఆపై అదే జోరును రెండో సెట్లోనూ కొనసాగించింది. ఆటను మూడో సెట్ కు తీసుకువెళ్లేందుకు సింధూ శ్రమించినా ఫలితం దక్కలేదు. ఈ మ్యాచ్ తరువాత భారత్ ఖాతాలోకి 26వ స్వర్ణ పతకం చేరగా, రజత పతకాల సంఖ్య 17కు పెరిగింది.
More Latest News
రష్యా సైనికులను వణికించిన మేక
42 seconds ago

ఈసారి చంద్రబాబు మాట కూడా వినం... వైసీపీ వాళ్ల వీపులు పగలడం ఖాయం: ప్రత్తిపాటి పుల్లారావు
3 minutes ago

శ్రీకాకుళంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
17 minutes ago

ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
33 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
37 minutes ago

శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
49 minutes ago
