కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిన తెలుగు తేజం
07-04-2018 Sat 17:10
- కామన్వెల్త్ క్రీడల్లో భారత్కి మరో స్వర్ణం
- వెయిట్ లిఫ్టింగ్లో 85 కిలోల విభాగంలో వెంకట రాహుల్కు స్వర్ణం
- భారత్కు ఇది నాలుగో పసిడి

కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు రాణిస్తున్నారు. ఈ రోజు భారత్కి మరో స్వర్ణం దక్కింది. వెయిట్ లిఫ్టింగ్లో 85 కిలోల విభాగంలో తెలుగు తేజం వెంకట రాహుల్ సత్తా చాటి స్వర్ణ పతకం సాధించాడు. వెంకట రాహుల్ గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం వాసి. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇది నాలుగో పసిడి పతకం. ఇప్పటివరకు ఈ గేమ్స్లో భారత్ మొత్తం 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలుచుకుంది. భారత్కు స్వర్ణం అందించిన తెలుగు తేజం రాగాల రాహుల్పై దేశంలోని ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. స్టువర్టుపురం వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు.
More Latest News
శ్రీకాకుళంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
10 minutes ago

ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
26 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
30 minutes ago

శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
42 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
2 hours ago
