తెలంగాణలో కొత్తగా 2,478 మందికి కరోనా
09-04-2021 Fri 10:35
- ఒక్కరోజులో కరోనాతో ఐదుగురి మృతి
- మొత్తం మరణాలు సంఖ్య 1,746
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,182
- జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 402 మందికి కరోనా
Advertisement 1
తెలంగాణలో మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 2,478 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 363 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,182కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,03,964 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,746గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 15,472 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 9,674 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 402 మందికి కరోనా సోకింది.
Advertisement 1
More Flash News
భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయండి: వాయుసేనను కోరిన రాజ్నాథ్
23 minutes ago
కరోనా ఎఫెక్ట్.. చారిత్రక కట్టడాల మూసివేత
53 minutes ago
Advertisement 1
'నీట్' పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా
3 hours ago
Advertisement 1