ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత... కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు!
08-04-2021 Thu 19:10
- బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం
- న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు
- పరస్పరం ఘర్షణ
- బార్ కౌన్సిల్ సభ్యుడు అజయ్ కుమార్ కు గాయం
- సీజేని కలిసేందుకు న్యాయవాదుల యత్నం
Advertisement 1
ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం రసాభాస అయింది. బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. అయితే, న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. పలువురు న్యాయవాదులు చేతికందిన కుర్చీలతో యుద్ధానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది.
ఈ ఘటనలో బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ కుమార్ గాయపడ్డారు. ఆయన తలకు దెబ్బ తగిలింది. ఈ ఘర్షణల నేపథ్యంలో అజయ్ కుమార్, ఇతర న్యాయవాదులు హైకోర్టు సీజేని కలిసేందుకు యత్నించారు. కాగా, ఈ సమావేశంలో న్యాయవాదులు రాయలసీమ, కోస్తా వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగినట్టు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో న్యాయవాదులు శాంతించారు.
Advertisement 1
More Flash News
కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన రాజస్థాన్... ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్
16 minutes ago
ఏదో ఒకరోజు సీఎం అవుతా: లోటస్ పాండ్ లో షర్మిల వ్యాఖ్యలు
29 minutes ago
Advertisement 1
'నీట్' పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా
2 hours ago
బాలయ్య సినిమాలో వేటపాలెం గ్యాంగ్ ఫైట్?
2 hours ago
Advertisement 1