ఇప్పటికైనా వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి: విష్ణువర్ధన్ రెడ్డి
06-04-2021 Tue 17:15
- ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే
- ఇది బీజేపీ, ఇతర విపక్షాల విజయం అన్న విష్ణు
- ప్రజస్వామ్యాన్ని గౌరవించాలని వైసీపీకి హితవు
- మళ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్
Advertisement 1
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. పరిషత్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఇది బీజేపీ, ఇతర విపక్షాల విజయం అని అభివర్ణించారు. ఇప్పటికైనా అధికార వైసీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని హితవు పలికారు. సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియకు నాలుగు వారాల వ్యవధి ఇవ్వాలని సూచించారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు.
Advertisement 1
More Flash News
'పుష్ప' యాక్షన్ కోసం అవుతున్న ఖర్చు 39 కోట్లు?
1 minute ago
తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
6 minutes ago
మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్నది ఎన్టీఆర్ కి చెప్పిన కథేనా?
30 minutes ago
218 సార్లు నామినేషన్ వేసిన ‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
43 minutes ago
Advertisement 1
దేశంలో కొత్తగా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ
48 minutes ago
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
3 hours ago
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం...11 మంది దుర్మరణం
3 hours ago
Advertisement 1